భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలదాకా నమోదవుతున్నాయి. బుధవారం కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఫ్యాన్లు, కూలర్లు నడిచినా ఉక్కపోతతో సతమతమయ్యారు.