హుజూరాబాద్టౌన్, జనవరి22: ఆపద లో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేరొన్నారు. ఆదివారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధి, మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ.11 లక్షల 19 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెకులను పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కా ర్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం రాకముం దు సీఎంసహాయనిధిని నామ మాత్రంగా అందించేసేవారన్నారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ సాయం మం జూరు అండగా నిలుస్తున్నారని చెప్పారు.
ప్రజల మేలు కోసం తపిస్తున్న సర్కారును ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, జడ్పీటీసీ పడిదం బకారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవల్లి కొండాల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు.
రాజేంద్రప్రసాద్ను స్ఫూర్తిగా తీసుకోవాలి
సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ సేవ లందించిన కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్ను నేటి త రం స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్బోధించారు. ఆదివారం హుజూరాబాద్లోని విద్యానగర్లో రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యం లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భం గా వార్డు ప్రజలు, ఎమ్మెల్సీ కలసి రాజేంద్రప్రసాద్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ మారెట్ కమిటీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, హాకీక్లబ్ అధ్యక్షుడిగా, కౌన్సిలర్గా పదవులు చేపట్టి వన్నెతెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు చొల్లేటి కిషన్రెడ్డి, పొలం పెళ్లి శ్రీనివాస్రెడ్డి, తాళ్లపల్లి రమేశ్గౌడ్ ఉన్నారు.