హుజూరాబాద్టౌన్/ఇల్లందకుంట, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు. సోమవారం హుజూరాబాద్లో లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల అశోక్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కృష్ణమోహన్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన లక్ష్మణ్బాపూజీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహాసభ రాష్ట్ర నాయకుడు శ్రీహరియాదవ్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ బండారి సదానందం, నాయకులు కన్నెబోయిన మహేందర్యాదవ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్యాదవ్, ఏనూరి అశోక్, బద్దుల రాజ్కుమార్, శ్రీనివాస్యాదవ్, అల్లి శ్రీనివాస్, కొలిపాక సమ్మయ్య, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తనకు పదవి అప్పగించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని, హుజూరాబాద్ బిడ్డగా ఈ గడ్డకు మంచి పేరు వచ్చేలా పని చేస్తానని ఈ సందర్భంగా వకుళాభరణం పేర్కొన్నా రు. ఇక్కడ ఎంపీపీ సరిగొమ్ముల పావని-వెంకటేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఐలయ్య, సర్పంచ్ దిలీప్రెడ్డి, ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, జమ్మికుంట టీఆర్ఎస్ పటణాధ్యక్షుడు రాజ్కుమార్, నాయకులు సత్యం, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.