ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వర ప్రాజెక్టు ఫలితం స్పష్టంగా కనిపిస్తున్నది. గోదావరి ఎగువన చుక్క నీరు లేకపోవడం, దిగువన కాళేశ్వరం వద్ద ప్రాణహిత ద్వారా గోదావరిలోకి 27,710 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడం.. ఎత్తిపోతల అవసరాన్ని నొక్కి చెబుతున్నది. సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మరుసటి రోజు నుంచే అధికారులు ప్రాజెక్టులోని లింక్-1, 2లలో పంప్హౌస్లలో 17 మోటర్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. దీంతో కాళేశ్వరం నుంచి పంపుల ద్వారా ఉప్పొంగుతూ గోదావరి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి పరుగులు పెడుతున్నది.
– పెద్దపల్లి, జూలై 3(నమస్తే తెలంగాణ)/ రామడుగు
పెద్దపల్లి, జూలై 3(నమస్తే తెలంగాణ)/ రామడుగు: సోమవారం బాసర వద్ద గోదావరికి ఇన్ఫ్లో జీరో క్యూసెక్కులు.. కానీ, ఇదే నదిలో కాళేశ్వరం వద్ద ప్రాణహిత ద్వారా వచ్చి చేరుతున్నది 27,710 క్యూసెక్కులు. దీనిని బట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అవసరాన్ని సుస్పష్టంగా తెలియజేస్తున్నది. సకాలంలో వానలు పడక పోవడంతో తాగు, సాగునీటికి కరువు రాకుండా ఉండేందుకు కాళేశ్వరం వద్ద ఇన్ఫ్లో ద్వారా వస్తున్న నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి అప్రమత్తం చేశారు. ఆ మేరకు అధికారులు సోమవారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లింక్-1, 2లలో 17 మోటర్లను ప్రారంభించి, నీటిని ఎగువకు తరలిస్తున్నారు.
లింక్ -1లో 14 పంపులు
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని మూడు పం ప్హౌస్ల్లో అధికారులు 14 పంపులను ప్రారంభించారు. ప్రాణహిత ద్వారా 27,710 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వ రం వద్ద గోదావరిలో కలుస్తుండగా, అధికారు లు ఇక్కడి కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్లోని 6 పంపులను ఆన్ చేసి 13,200ల క్యూ సెక్కు ల నీటిని అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మం డలం కాసిపేలోని సరస్వతీ పంపు హౌస్లోని 4 పంపులను ఆన్ చేసి 11,720ల క్యూ సెక్కుల నీటిని మంథని మండలం సిరిపురంలో ని పార్వతీ బరాజ్లోకి, అంతర్గాం మం డలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్లోని నాలుగు మోటర్లను ఆన్ చేసి 10,440 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
లింక్ -2లో మూడు మోటర్లు
ఎల్లంపల్లికి చేరిన జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపు హౌస్కు వెళ్తుండగా, అక్కడి రెండు (5వ, 6వ)మోటర్లను ఆన్ చేసి అండర్ టన్నెల్ ద్వారా 6300ల క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి టన్నుల్ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు టన్నెళ్ల ద్వారా నీటిని తరలిస్తుండగా, అక్క డ ఐదో మోటర్ను ఆన్ చేసి 3150 క్యూసెక్కు ల నీటి ఎత్తిపోస్తూ వరద కాలువ ద్వారా శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.