అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఎంతో మంది ఆశలు అడియాసలయ్యాయి.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తాజా, ఫలితాలను చూస్తే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 235 మంది పోటీ చేసినా.. కేవలం 31 మందే ధరావతు దక్కించుకున్నారు. మిగిలిన 204 మంది డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. బీజేపీ ఎనిమిది చోట్ల.. ఏఐబీఎఫ్, బీఎస్పీ అన్ని చోట్లా నామినేషన్ ఫీ (డిపాజిట్) కోల్పోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ ధరావతు దక్కించుకోగా.. ఈసారి ఓటర్లు ప్రధాన పార్టీలవైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎంతో మంది పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పూర్వ కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల పరిధిలో 235 మంది బరిలో నిలిచారు. కానీ, అందులో 204 మంది డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇంతకీ డిపాజిట్ గల్లంతు కావడమంటే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో కొంత సొమ్మును ధరావతుగా చెల్లిస్తారు. జనరల్, బీసీ కేటగిరీకి అయితే 10 వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే 5 వేల చొప్పున నామినేషన్ రుసుం (డిపాజిట్) కడుతారు. పోలింగ్ ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీస ఓట్లు వస్తే డిపాజిట్ తిరిగి ఇస్తారు. నిబంధనల ప్రకారం డిపాజిట్ రావాలంటే.. పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 1/6 వంతు (16.66 శాతం) ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే దాదాపు ప్రతి 100 ఓట్లకు 17 ఓట్లు రావాల్సి ఉంటుంది. అలా పొందిన అభ్యర్థులకు మాత్రమే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. లేదంటే, అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతుగా లెక్కిస్తారు.
ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 27 మంది బరిలో నిలిచారు. ఇక్కడ 5,307 పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2,29,774 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 92179 ఓట్లు సాధించి విజయం అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. మిగిలిన 24 మందికి డిపాజిట్ దక్కలేదు. బీఎస్పీ అభ్యర్థి ఎన్ శ్రీనివాస్ 1646 (0.67శాతం) ఓట్లు, అలాగే ఏఐఎఫ్బీ అభ్యర్థి అంబటి జోజిరెడ్డి 430 (0.19 శాతం) ఓట్లు సాధించగా, కనీస డిపాజిట్ దక్కలేదు.
ఈ నియోజకవర్గంలో పోస్టల్ ఓట్లు 983తో కలిపి మొత్తం 1,82,188 పోలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 14 మంది పోటీ చేశారు. అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా మిగిలిన 12 మంది డిపాజిట్ కోల్పోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బొడిగె శోభకు 26,669 (14.64శాతం ) ఓట్లు, అలాగే బీఎస్పీ అభ్యర్థి కొంకటి శంకర్కు 5153 (2.83శాతం) ఓట్లు వచ్చినా.. డిపాజిట్ రాలేదు.
అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ ఓట్లు 1,416 కలిపి మొత్తం 1,85,829 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 10 మంది పోటీ పడ్డారు. అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా మిగిలిన ఎనిమిది మంది డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఆరెపల్లి మోహన్కు 14,879 (8.01శాతం) ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి రామచంద్రం 3,345 (1.8 శాతం) ఓట్లు, ఏఐఎఫ్బీ అభ్యర్థి గణేశ్కు 324(0.17) ఓట్ల రాగా, డిపాజిట్ కోల్పోయారు.
ఈ నియోజకవర్గంలో 22 మంది పోటీలో ఉన్నారు. పోస్టల్ ఓట్లు 1689తో కలిపి మొత్తం 2,09,311 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి 80333 ఓట్లు సాధించి గెలిచారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మిగిలిన 19 మంది డిపాజిట్ కోల్పోయారు. బీఎస్పీ అభ్యర్థి పల్లె ప్రశాంత్గౌడ్కు 2150 (1.03) ఓట్లు రాగా, డిపాజిట్ దక్కలేదు.
ఇక్కడ 15 మంది బరిలో నిలిచారు. పోస్టల్ ఓట్లు 1875 కలుపుకొని 1,76,359 పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మాకనూరి సంజయ్ కుమార్ 70,243 ఓట్లు సాధించి, రెండోసారి విజయం అందుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మిగిలిన 12 మంది డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. బీఎస్పీ అభ్యర్థి మల్లేశం యాదవ్కు 1242 (0.7శాతం) ఓట్లు రాగా, డిపాజిట్ దక్కలేదు.
ఇక్కడ పోస్టల్ ఓట్లు 1239 కలుపుకొని మొత్తం 1,81, 690 ఓట్లు పోలయ్యాయి. 15 మంది బరిలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా 13 మంది డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్కు 7345 (4.04) ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి నక్క విజయ్కుమార్కు 1344 (0.74) ఓట్లు వచ్చినా.. డిపాజిట్ రాలేదు. అలాగే ఏఐఎఫ్బీ అభ్యర్థి సైతం డిపాజిట్ కోల్పోయారు.
ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది పోటీ పడ్డారు. పోస్టల్ ఓట్లు 1450తో కలిపి మొత్తం 1,83,590 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తొలిప్రయత్నంలో విజయం అందుకున్నారు. 72,115 ఓట్లతో గెలుపొందారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. మిగిలిన 12 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. బీఎస్పీ అభ్యర్థి కార్తికేయ పూదరికి 2,466 (1.34 శాతం) ఓట్లు, ఏఐఎఫ్బీ అభ్యర్థి శ్రీనివాసరావుకు 657 (0.36శాతం) ఓట్లు రాగా, డిపాజిట్ దక్కలేదు.
పూర్వ కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న బీజేపీ, కేవలం ఐదు చోట్ల డిపాజిట్లు దక్కించుకున్నా ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేకపోయింది. చొప్పదండి, మానకొండూర్, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలు.. మొత్తం ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అలాగే, బహుజన సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) అభర్థులు కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంది.
అసెంబ్లీ నియోజకవర్గంలో 17 మంది బరిలో నిలిచారు. పోస్టల్ ఓట్లు 1376తో కలుపుకొని 2,07,944 ఓట్లు పోలయ్యాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా మిగిలిన 15 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. అందులో బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్కుమార్కు 6,312 (3.04శాతం) ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషకు 19,315 (4.96శాతం) ఓట్లు వచ్చినా.. డిపాజిట్ కోల్పోయారు.
ఇక్కడ 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోస్టల్ ఓట్లు 908 కలుపుకొని మొత్తం 1,96,543 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా 19 మంది డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్రెడ్డికి 5779 (2.74 శాతం) ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి చల్ల నారాయణరెడ్డికి 2937 (1.49 శాతం) ఓట్లు వచ్చినా.. డిపాజిట్ మాత్రం రాలేదు.
ఈ అసెంబ్లీ నియోజకవర్గలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ పోస్టల్ ఓట్లు 1,129 కలుపుకొని మొత్తం 1,52,988 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ విజయం సాధించగా, రెండోస్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నిలిచారు. మిగిలిన 21 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యరాణికి 12,966 (6,48 శాతం) ఓట్లు రాగా డిపాజిట్ కోల్పోయారు. బీఎస్పీ అభ్యర్థి అంబటి నరేశ్యాదవ్ 853 (0.56 శాతం) ఓట్లు వచ్చినా.. డిపాజిట్ దక్కలేదు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన సోమారపు సత్యనారాయణ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినా.. కనీస డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.
ఈ నియోజకవర్గంలో 21 మంది పోటీలో ఉన్నారు. అయితే, ఇక్కడ పోస్టల్ ఓట్లు 1418 కలుపుకొని 1,88,740 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావు 88,761 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మినహా 19 మంది డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమకు 18,328 (9.71 శాతం) ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి పిట్టల భూమేశ్ 7585 (4.02శాతం) ఓట్లు, ఏఐబీఎఫ్ అభ్యర్థి పత్తిపాక సురేశ్కు 1166 (0.62శాతం) ఓట్లు వచ్చినా.. డిపాజిట్ పొందలేకపోయారు.
ఈ నియోజకవర్గంలో పోస్టల్ ఓట్లు 1263 కలుపుకొని మొత్తం 1,74,145 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 16 మంది బరిలో ఉండగా 13 మంది తమ డిపాజిట్ కోల్పోయారు. బీఎస్పీ అభ్యర్థి గోలిమోహన్ 4,649 (2.67శాతం) ఓట్లు, ఏఐబీఎఫ్ అభ్యర్థి గుగ్గిళ్ల రవిగౌడ్ 247 (0.14 శాతం) ఓట్లు సాధించినా.. డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.
ఇక్కడ పోస్టల్ ఓట్లు 1681 కలుపుకొని మొత్తం 2,06,698 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 19 మంది బరిలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా మిగిలిన 17 మంది డిపాజిట్ కోల్పోయారు. అందులో బీజేపీ నుంచి పోటీ చేసిన బొమ్మ శ్రీరాం చక్రవర్తి 8,338 (4.03 శాతం) ఓట్లు, బీఎస్పీ నుంచి పోటీ చేసిన పీ శ్రీనివాస్ 2694 (1.3 శాతం) ఓట్లు సాధించినా.. డిపాజిట్ కోల్పోయారు.