అమరావతి : తిరుమలలో ఇవాళ ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో తిరువీధులన్నీ జలమయంగా మారాయి.
రహదారులపై భారీగా వరద నీరు నిలిచింది. ఉదయం వాతావరణం సాధారణంగానే ఉన్నా మధ్యాహ్నానికి ఒక్కసారిగా చల్లబడి ఆకాశం మేఘావృతమై వర్షం దంచికొట్టింది.
వర్షం కారణంగా భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి