చందుర్తి, జనవరి 12: ‘గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామన్నరు. మ్యానిఫెస్టోలో పెట్టినన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది. మరి కరెంట్ బిల్లులు కట్టుడా..? లేదా..? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలి. మహిళలకు బస్సు ఫ్రీ చేయడం సంతోషమే కానీ, ఆటోకార్మికుల పరిస్థితి ఏంటో చెప్పాలి’ అని అధికారులను చందుర్తి ప్రజాప్రతినిధులు నిలదీశారు. గ్రామాల్లోని సమస్యలు, ప్రభుత్వ పథకాలపై స్పష్టత ఇవ్వాలంటూ కన్నెర్ర జేశారు. చందుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బైరగోని లావణ్య అధ్యక్షతన శుక్రవారం వాడీవేడీగా జరిగింది.
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలపై రగడ నెలకొన్నది. మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు బస్సు ఫ్రీ చేయడం మంచిదే కానీ, మండలంలో 500 మంది ఆటో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కో ఆప్షన్ సభ్యుడు బత్తుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వారికి చేయూతనివ్వాలని కోరారు. విద్యుత్ లోవోల్టేజ్ సమస్యను పరిషరించాలని జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేశ్ కోరారు. అంతర్గత రోడ్లకు ఇరువైపులా మట్టి లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, సైడ్ ఫార్మ్స్ పనులు వెంటనే చేపట్టాలని ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, సర్పంచ్ చిలుక అంజి బాబు వాగ్వాదానికి దిగారు.
మోతరావుపేట, చందుర్తి రోడ్ల నిర్మాణాలపై స్పష్టత ఇవ్వాలని సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు డిమాండ్ చేయగా, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ నాల్యకొండ అరుణ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కీలకమని, సమన్వయంతో ముందుకుసాగు తూ ఇన్నాళ్లూ ఎంతో ప్రగతిసాధించారని, ఇప్పుడూ అలాగే నడుచుకోవాలని సూచించారు. ఇ కడ జడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచుల ఫోరం కన్వీనర్ కమలాకర్ రావు, ఎంపీటీసీల ఫో రం కన్వీనర్ వేణు, ఎంపీడీవో రవీందర్, తాసిల్దార్ సీహెచ్ శ్రీనివాస్, ఎంపీఓ ప్రదీప్ ఉన్నారు.