తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్25: ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. పేదల మేలు కోసం రాష్ట్ర సర్కారు అమ లు చేస్తున్న పథకాలకు మెచ్చే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన 200మంది యువకులు వైస్ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేరగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రతి ఒకరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ఇంకా భారీగా వలసలు కొనసాగుతాయన్నారు. కాగా, అంతకుముందు యువకులు రేణికుంట నుంచి పెద్ద ఎత్తున డీజే మోతలతో బైక్ ర్యాలీగా వచ్చి పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధి కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమే శ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఇనుకొండ జితేందర్ రెడ్డి, ఎలుకా ఆంజనేయులు, ఉప సర్పంచ్ కుంబం శ్రీనివాస్, బొంగోని రమేశ్ గౌడ్, బోయిని తిరుపతి, నాయకులు, తదితరులు ఉన్నారు.