నా కాలికి నొప్పి ఉన్నది. అయినా లెక్క చేయకుండా రైతుల గోసను చూసి వచ్చిన. సర్కారు పరిహారం ఇప్పించేందుకు పొలాల్లో తిరుగుతున్న. ఈ సమయంలో రాజకీయాలు సరికాదు. అందరూ రైతుల కోసం పనిచేయాలి. గవర్నర్ సైతం ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ రాయాలి. ఇతర పార్టీల నాయకులు మాతో కలిసి వస్తే నష్టాన్ని స్వయంగా చూపిస్తం. అన్నదాతను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తున్నరు. ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తున్నరు. రైతులపై కేంద్రానికి ప్రేముంటే అదనంగా మరో 20 వేల పరిహారం ఇవ్వాలి.
– కొత్తపల్లి మండలం కమాన్పూర్లో మంత్రి గంగుల కమలాకర్
కొత్తపల్లి, మే 4: ‘కేంద్రంలోని బీజేపీ సర్కారు కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలి. వారి ఇబ్బందులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయవద్దు. అన్నదాతల బతుకులతో ఆడుకోవద్దు’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖల మంత్ర గంగుల కమలాకర్ హితవుపలికారు. తె లంగాణ ప్రజలు కట్టే జీఎస్టీ, పన్నులతో ఎంజా య్ చేస్తున్న కేంద్రం, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. వారు ఈ దేశంలో భాగం కాదా..? అని ప్రశ్నించారు. ఎన్నడూలేనివిధంగా కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కానీ కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డా రు. చిత్తశుద్ధి ఉంటే వారికి అండగా నిలువాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్లో గురువారం మంత్రి పర్యటించారు. వానలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రైతు లు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారన్నారు. వారిని ఆదుకొనే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ధా న్యం 67 కిలోల ఔటర్న్ ను 50 కిలోలకు తగ్గించాలని, తేమశాతం 17 నుంచి 20 శాతానికి పెం చేలా ఎఫ్సీఐకి ఆదేశాలివ్వాలని కోరారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. త డిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్సీఐ నిబంధనలు సడలించేలా రైస్ మిల్లర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఔటర్న్ పై నిర్ణయం తీసుకోవాలన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, సర్పంచ్ జినుక సంపత్, పిట్టల రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్దన్, ఫ్యాక్స్ డైరెక్టర్ తిరుమల్, ఉప సర్పంచ్ మాధవి మునీందర్ ఉన్నారు.