కూలీల భాగస్వామ్యం పెంచాలి
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత
వెదిరలో ‘ఉపాధి’ పనుల పరిశీలన
కోనరావుపేటలో కొనుగోలు కేంద్రం సందర్శన
రామడుగు, మే19: ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో కూలీలు కొవిడ్ నిబంధనలు పా టించాలని డీఆర్డీవో శ్రీలత సూచించారు. నిర్ణీత దూరం పాటించడంతో పాటు, తప్పనిసరిగా మా స్క్లు ధరించాలని నిర్దేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో కూలీలు పెద్దసంఖ్యలో పనులకు హాజరయ్యేలా చూడాలని ఉపాధిహామీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందిని ఆదేశించారు. జాబ్కార్డులు లేనివారికి వెంటనే జారీచేయాలన్నారు. మండలంలోని వెదిర పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనులను బుధవారం ఉద యం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ అభివృద్ధి పనుల నిర్వహణలో ఆయా గ్రామాల ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. వేసవి తాపం పెరగడంతో పాటు కరోనా నేపథ్యంలో కూలీలు వాతావరణం అనుకూలంగా ఉన్న వేళల్లో పనులు చేసుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. వడదబ్బకు గురైన సందర్భాల్లో చికిత్స చేసేందుకు వీలుగా ప్రాథమిక చికిత్స కిట్ను అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం కూలీలకు మా స్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు. అక్కడినుంచి నేరుగా వెదిర అనుబంధగ్రామం కోనరావుపేటలోని రైతువేదిక సమీపంలో ఏర్పాటు చేసి న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం తేమశాతాన్ని డీఆర్డీవో పరీక్షించారు. న్యాన్ని సకాలంలో కొని వెంటనే మిల్లుకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్గౌడ్, ఉప సర్పం చ్ ఎడవెల్లి సత్యనారాయణరెడ్డి, ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్ దొడ్డలచ్చిరెడ్డి, ఏపీవో రాజు, కార్యద ర్శి మునిగాల అనిల్, కారోబార్ అశోక్రెడ్డి ఉన్నారు.