పెగడపల్లి, ఆగస్టు 9: స్వరాష్ట్రంలోనే పల్లెల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని, మౌళిక వసతుల క ల్పనకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 1400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 2.25 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బుధవారం ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈశ్వర్ మాట్లాడా రు. సీఎం కేసీఆర్ నేతృత్యంలో పట్టణాలకు దీటు గా పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, సబ్బండవర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నూతనంగా రోడ్లు, వంతెనల నిర్మాణం, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నామని చెప్పా రు. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసి ఆర్థిక ప్రయోజనం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ని ర్మాణంతో వరి సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి గణనీయంగా వస్తున్నా, రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా పంటను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.