ఇటీవల మృతి చెందిన అనూష భర్త నవీన్
సర్వేలో వివరాలివ్వని బాధితురాలు
మంత్రి కొప్పులను కలిసిన అనూష
లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని కలెక్టర్కు సూచించిన ఈశ్వర్
ఆనందంలో కుటుంబసభ్యులు
జమ్మికుంట, సెప్టెంబర్ 15: భర్త మరణంతో దళితబంధుకు దూరమైన ఓ దళితబిడ్డకు మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు. కలెక్టర్తో మాట్లాడి లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఇందుకు పాలానాధికారి సానుకూలంగా స్పందించడంతో ఆ నిరుపేద ఆడబిడ్డ కుటుంబం ఆనందంలో మునిగితేలింది. వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన అంబాల అనూషకు, పట్టణానికి చెందిన బబ్బెర్ల నవీన్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి 11నెలల బాబు ఉన్నాడు. నవీన్కు ఇటీవల జ్వరంతో బాధపడుతూ 20 రోజుల క్రితం మృతి చెందాడు. ఇదే సమయంలో దళిత బంధు పథకం సర్వే చేపట్టారు. భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న అనూష అధికారులకు వివరాలివ్వలేదు. పైగా ఆమె రేషన్ కార్డు, ఆధార్ కార్డులో ఇంటి పేరు మారలేదు. కాగా, అనూష బంధువులను వెంటపెట్టుకొని బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి తన దయనీయ పరిస్థితిని వివరించింది. స్పందించిన అమాత్యుడు వెంటనే కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. దళిత బంధు లబ్ధిదారుల జాబితాలో పేరు నమోదు చేయించాలని కోరారు. సర్వే చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారు. కాగా, అడిగిన వెంటనే అనూషకు న్యాయం చేసిన మంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.