కార్పొరేషన్, జనవరి 13: నగరంలో చేపట్టే కంటి వెలుగు కార్యక్రమానికి బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసినట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. రాంనగర్లోని మహిళా సంఘ భవనంలో శుక్రవారం కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన మాక్డ్రిల్ను ఆయన పరిశీలించారు. ఈ శిబిరంలో నమోదు కౌంటర్, కంటి చూపు పరిశీలన కౌంటర్, తదితర సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ, 18న ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలను 18 ఏళ్లు పైబడిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నగరపాలక సంస్థ ద్వారా శిబిరాల వద్ద ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని సెంటర్ల వద్ద సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా 60 డివిజన్లలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మొదటి విడుతలో 13 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, అదనపు కమిషనర్ స్వరూపారాణి, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ మహేందర్, బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.