కమాన్చౌరస్తా, మార్చి 18: పది పరీక్షలు మొదలయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 38,095 మంది విద్యార్థుల కోసం విద్యాశాఖ జిల్లాల వారీగా 219 సెంటర్లు ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 పరీక్ష నిర్వహించగా, మొత్తంగా 38,029 మంది పరీక్షలు రాశారు. 66 మంది గైర్హాజరయ్యారు.
కాగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల, మంకమ్మతోటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ధన్గర్వాడీ) సెంటర్లను కలెక్టర్ పమేలా సత్పతి, జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె వద్ద గల గౌతమి స్కూల్, బైపాస్ రోడ్డులోని ఆక్స్వర్డ్ హైస్కూల్, పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ హైస్కూళ్లలోని సెంటర్లను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలోని సెంటర్ను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.