గంభీరావుపేట, ఆగస్టు 5: ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ, రైతులకు మెరుగైన సేవలు అందించాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సూచించారు. గంభీరావుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో గురువారం చైర్పర్సన్ సుతారి బాలవ్వ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. పంటల మార్పిడి, అధునాతన పద్ధతులపై మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో అన్నదాతల ఆదాయం పెంపే లక్ష్యంగా వారికి సేవలందించాలన్నారు. గంభీరావుపేట మార్కెట్ యార్డ్ను ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో లింగన్నపేటలో ఉప మార్కెట్ కమిటీ కార్యాలయం ఏర్పాటు, కల్లం నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి షాబొద్దీన్, వైస్ చైర్మన్ యాదిలాల్, కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు జంగంపల్లి శేఖర్గౌడ్, ఆల్యా, శివయ్య, రాములు, కిష్టయ్య, రమేశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
వీర్నపల్లి, ఆగస్టు 5: మారుమూల ప్రాంత యువతీ యువకులు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ వైండింగ్ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. స్థానికంగా వ్యాపార కేంద్రాలను ప్రారంభించి ఉపాధి పొందాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు కొండూరిని సన్మానించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
వీర్నపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ గద్దెరాశి ప్రమీల ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, బాధిత కుటుంబ సభ్యులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పరామర్శించారు. ఘటనకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎంపీపీ మాలోత్ భూల, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎడ్ల సాగర్, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడ జగన్, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్నాయక్, సర్పంచులు దినకర్, రవినాయక్, జగ్మల్, ఉపసర్పంచ్ రవి, నాయకులు మల్లేశం, భాస్కర్, శ్రీరాంనాయక్, అశోక్ ఉన్నారు.