కోర్టు చౌరస్తా, అక్టోబర్ 2: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సుప్రీం కోర్టు సూచన మేరకు శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం లో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గాంధీ జయంతిని పురసరించుకొని మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం మాట్లాడుతూ.. గాంధీ జయంతి నుంచి నవంబర్ 14వరకు సుమారు 44రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1,279 గ్రామా ల్లో ఉచిత న్యాయ సలహాలు, సేవలందిస్తామని తెలిపారు. ఇందుకు ఏర్పాటు చేసిన బృందాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను గుర్తించి సేవలందిస్తాయని చెప్పారు. బృందాల్లో న్యాయమూర్తి, ప్యానల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్, న్యాయ విద్యార్థులు, స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు, తగాదాలు, పంచాయితీలను పరిషరిస్తాయని తెలిపారు. నిరక్షరాస్యులను చైతన్యం చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా, లోక్ అదాలత్ల ద్వారా ఎలాం టి ఫలాపేక్ష లేకుండా సమస్యలు, కేసుల పరిషారానికి బృందాలు సేవలందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఢిల్లీలో జాతీయ న్యా య సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా వీక్షించారు. జిల్లా జడ్జి సహా మిగతా న్యాయమూర్తులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశా రు. మొదటి అదనపు జిల్లా జడ్జి భవానీచంద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజ య్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్రావు, ప్రధాన కార్యదర్శి జూపల్లి సత్యనారాయణరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డి, జిల్లా కేంద్ర న్యాయమూర్తులు, న్యాయ సేవలందించే బృందాల సభ్యులు, న్యాయవాదులున్నారు.