నేతన్న చౌరస్తా, సెప్టెంబర్ 20: జిల్లా వ్యాప్తంగా గణనాథుడి నిమజ్జనం రెండో రోజూ కొనసాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాలను ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం సమీపంలోని వాగులు, కుంటలు, చెరువుల్లో గణనాథుడిని నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు.
గంభీరావుపేట, సెప్టెంబర్ 20: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం వినాయక నిమజ్జనం నిర్వహించారు. వాహనాల్లో వినాయకులను తీసుకుపోయి చెరువుల్లో నిమజ్జనం చేశారు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 20: చిన్నబోనాల వినాయక మండపంలో సోమవారం సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, విజయ డెయిరీ జిల్లా అధ్యక్షుడు దడిగెల శ్రావణ్రావు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ , టీఆర్ఎస్ సహాయ కార్యదర్శి, పట్టణాధ్యక్షుడు, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు దార్ల సందీప్, కల్లూరి లత, మధు, కల్లూరి రాజును దడిగెల శ్రావణ్రావు సన్మానించారు. మాజీ ఎంపీపీ దడిగెల కమలాబాయి, కిషన్రావు, బండారి శ్యాం, మ్యాన రవి ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 20: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమం సోమవారం పూర్తయింది. ఆదివారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు పూర్తి చేయగా, భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. కొందరు ఆదివారం, మరికొంత మంది సోమవారం నిమజ్జనం చేశారు.
ముస్తాబాద్ సెప్టెంబర్ 20: మండలంలోని పోతుగల్, ముస్తాబాద్, గూడెం, ఆవునూర్, బందనకల్, చీకోడు, నామాపూర్ మద్దికుంట, చీకోడు గ్రామాల్లో సోమవారం గణనాథుల నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మండపాల్లో పూజలు నిర్వహించారు. పోతుగల్లో సర్పంచ్ తన్నీరు గౌతంరావు, సహకార సంఘం అధ్యక్షుడు తన్నీరు బాపూరావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్తో పాటు పలు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, నిర్వాకులు పూజలు చేసి శోభాయాత్రలు ప్రారంభించారు.