బాన్సువాడ : జాతిపితా మహాత్మాగాంధీ అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మాదరిగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ వివిధ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మున్సిపాలిటీలో ఉత్తమ సేవలను అందిస్తున్న కార్మికులకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ ..స్వచ్ఛ తెలంగాణ లో భాగంగా ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఆయన మాట్లాడుతూ ఉచిత కరెంటు, రైతు బంధు, రైతుబీమా,దళితబంధు పథకాలు దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్ , మున్సిపల్ కమిషనర్ రమేశ్ , మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతు బంధు సమితి కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణా రెడ్డి, దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్, బుడ్మి సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ ,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ , యువజన విభాగం అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.