జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి
నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 19 : చట్టాలను చదవడంతో చట్టపరిజ్ఞానం పెంపొందుతుందని, ఆ విజ్ఞానం ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుందని ఉమ్మడి జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.గోవర్ధన్రెడ్డి అన్నా రు. న్యాయార్థులు ప్రథమంగా వారి సమస్యల గురించి సంప్రదించే మొదటివారిలో న్యాయ సేవా సంస్థ ప్యానల్ న్యాయవాదులేనని పేర్కొన్నారు. ఏ వృత్తిలో రాణించాలన్నా నైపుణ్యం కలిగి ఉండాలని, అప్పుడే ఒడిదుడుకులు తట్టుకోగలుగుతారన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘న్యాయవాదులు – న్యాయపరమైన నైపుణ్యాలు’ అనే అంశంపై నిర్వహించిన శిక్షణా తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వృత్తి నైపుణ్య శిక్షణ భవిష్యత్తులో నూతన చట్టపరమైన సమస్యలకు చేదోడుగా నిలుస్తుందన్నారు. ప్రతి వ్యక్తిలో వృత్తి నైపుణ్యత ఉంటుందని దానిని సాన పట్టుకోవడంతో అది మరింత వృత్తి జీవన కళను కలిగి ఉంటుందన్నారు. మాస్టర్ ట్రైనర్స్ తమ విలువైన అనుభవాలను తెలిపారని అన్నారు. నిరంతర పఠనం, శిక్షణ మరింత విజ్ఞానాన్ని అందిస్తుందన్నారు. ఒకరి నుంచి మరొకరికి విషయ పరిజ్ఞానం విస్తరింపజేయడమే శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ మాట్లాడుతూ.. సంస్థ ప్యానల్ న్యాయవాదుల కోసం తద్వారా ప్రజలకు న్యాయ సంబంధిత విషయాలు వెళ్లే విధంగా కృషి చేస్తున్నామన్నారు. న్యాయసేవల చట్టం, గృహహింస చట్టం, అరెస్ట్ విధి విధానాల గురించి మాస్టర్ ట్రైనర్స్ రాజ్కుమార్ సుబేదార్, నందనారాయణ వివరించారు. న్యాయ సేవా సిబ్బంది, ప్యానల్ న్యాయవాదులు జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డిని శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ప్యాన ల్ న్యాయవాదులు మాణిక్రాజ్, దాసరి పుష్యమిత్ర, వెంకటేశ్, పోడేటి శంకర్, సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తంగౌడ్, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.