కామారెడ్డి, మే 9 : కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి సరైన విధంగా మందు లు అందజేయాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించి కొవిడ్ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఇంటింటి సర్వే, కరోనా పాజిటివ్ కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పాజిటివ్ వచ్చిన వా రు ఐసొలేషన్లో ఉండే విధంగా చూడాలని, వారికి అవసరమైన మందులను అందజేయడంతోపాటు సలహాలు, సూచనలు అందించాలన్నారు. వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి కరపత్రాలు, మందుల కిట్ల ను పంపిణీ చేశారు. ఆశవర్కర్లతో మాట్లా డి ఇంటింటి సర్వేపై పలు వివరాలను తెలుసుకున్నారు. సర్వేకు సం బంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, కరోనా లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. ఆరోగ్య కేం ద్రంలో వ్యాక్సినేషన్ వివరాలను వైద్యాధికారులు రవీందర్, శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎండీవో అనంతరావు, ఎంపీపీ గాల్రెడ్డి, తహసీల్దార్ గోవర్ధ్దన్, ఎంపీవో ప్రవీణ్కుమార్, ఉపసర్పంచ్ బోడ నరేశ్ ఉన్నారు.