రూరల్ ఏడీఏ వెంకటలక్ష్మి
నిజామాబాద్ రూరల్, జూన్ 9: రైతుబంధు పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు గురువారంతో గడువు ముగుస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఏడీఏ వెంకటలక్ష్మి కోరారు. మండల వ్యవసాయాధికారి హీరా జాదవ్, ఏఈవో రాకేశ్తో కలిసి ఆమె గుండారం గ్రామంలో ఉన్న రైతువేదిక భవనా న్ని బుధవారం సందర్శించారు. ఎంతమంది రైతులు కొత్తగా రైతుబంధు కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఆమె అడిగి తెలుసుకున్నారు. భూమి కొనుగోలు చేసిన రైతులు ధరణి వెబ్సైట్లో తమ పేరిట భూమి మార్పిడి చేసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు అందించిన కొత్త పాస్బుక్ పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. కొత్త పాస్బుక్, బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్లను తమ పరిధిలో ఉన్న ఏఈవోలకు గురువారం సాయంత్రం వరకు సమర్పించాలని సూచించారు. కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల జాబితాను హైదరాబాద్ సీసీఎల్ఏ నుంచి ప్రకటిస్తారని, ఈ జాబితా ఆధారంగా రైతుబంధు పథకం వర్తించడం కోసం ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ఏఈవోలు చేపడుతారని ఆమె వివరించారు.
రైతు వేదికల ద్వారానే సేవలు..
ధర్పల్లి, జూన్ 9 : మండలంలోని రైతులకు ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల ద్వారానే ఏఈవోలు సేవలందిస్తారని, దీనిని క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రా మాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మం డల వ్యవసాయాధికారి ప్రవీణ్ సూచించారు. మండలంలోని దుబ్బాక రైతు వేదికను బుధవారం సందర్శించిన ఆయన అక్కడికి వచ్చిన నూతన ఫర్నిచర్ను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదన్న ఉద్దేశంతో క్లస్టర్ల వారీగా ప్రభుత్వం రైతువేదికలను నిర్మించిందని చెప్పారు. వీటిలో ఏఈవోలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు తమకెలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి సహాయం కావాలన్న రైతు వేదికకు వచ్చి ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. సర్పంచ్ వెంకటేశ్, రైతులు, నాయకులు శేఖర్రెడ్డి, విజయేందర్రెడ్డి, ఏఈవో అనూష ఉన్నారు.