హైదరాబాద్ : మల్టీలెవల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడిన నలుగురిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ను ప్రయోగించారు. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్తో సంబంధం కలిగివున్న అభిలాష్ థామస్, ప్రేమ్ కుమార్, సుబ్రహ్మణ్యం, ఇమదుల్లా షరీఫ్ మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతుండటంతో ఈ ఏడాది ప్రారంభంలో పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వీరిపై పీడీ చట్టాన్ని అమలు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. చర్లపల్లి సెంట్రల్ జైలులో వీరికి ఈ ఆర్డర్లు అందించబడ్డాయి.