జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం రూ.22. 86 లక్షలతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయంలోఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆనాటి జనాభాకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, ప్రస్తుతం పట్టణం అభివృద్ధి చెందడంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయిందన్నారు.
దీంతో భక్తుల ఇబ్బందులను గమనించి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ నిధులు సరిపోవని ఆలయ కమిటీ తనకు విన్నవించింది అని మరో రూ.40 లక్షలు మంజూరు కృషి చేస్తానన్నారు. అలాగే వెయ్యి కోట్ల వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.