జయశంకర్ భూపాలపల్లి, మే 11 (నమస్తేతెలంగాణ) : రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న డీలర్ల ఆటలు కట్టేందుకు సివిల్ సప్లయ్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల 10న ‘నమస్తే తెలంగాణ’లో ‘పేదల బియ్యం పక్కదారి’ కథనానికి స్పందించిన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు భూపాలపల్లి మండలంలోని కాశింపల్లి ఆరో నంబర్ రేషన్ షాపును మంగళవారం సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ ముస్తఫా తనిఖీ చేశారు. రేషన్ షాపుకు 49 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయగా ఈనెల 8 నుంచి అమ్మకాలు చేపట్టారని డీటీ తెలిపారు. ఈ రోజు వరకు ఆ షాపులో కేవలం 38 క్వింటాళ్ల బియ్యం మాత్రమే నిల్వ ఉండాల్సి ఉండ గా 10 క్వింటాళ్లు అదనంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రేషన్ షాపులో ఉండాల్సిన నిల్వల కన్నా ఎక్కువగా ఉన్నందున ఆ షాపు డీలర్ పై 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి, షాపును 29వ రేషన్ షాపు డీలర్కు అటాచ్ చేసినట్లు తెలిపారు. రేషన్ బియ్యం తేడాలకు సంబంధించిన కేసును జాయింట్ కలెక్టర్ కోర్టులో దాఖలు చేయనున్నట్లు డీటీ చెప్పారు.