కాశీబుగ్గ, ఏప్రిల్ 11 : విలీన గ్రామాల్లో మరింత వసతులు కల్పిం చేందుకు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్ ఎనుమాములలోని ఎన్టీఆర్నగర్లో రోడ్డు, డ్రైనేజీలు, ఎనుమాముల నుంచి ఇందిరమ్మకాలనీ వరకు రోడ్డు, డ్రైనేజీలు, సాయిగణేశ్కాలనీలకు సీసీ రోడ్డు, మార్కెట్ రెండో గేట్ నుంచి ఇందిరమ్మ కాలనీకి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ తూర్పాటి సులోచన, మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్తో పాటు మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. డివిజన్లో రూ.8కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ నాయకుడు సిలువేరు శ్రీనివాస్ స్వాగతం పలికారు. అలాగే, బాలాజీనగర్ జంక్షన్లో టీఆర్ఎస్ నాయకుడు కేతిరి రాజశేఖర్ పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముడుసు నరసింహ, గండ్రాతి భాస్కర్, పత్రి సుభాష్, గంధం గోవింద్, జంగం రాజు, మాధవి, హైమావతి, విజయ, మో త్కూరి రాజమౌళి, సలీం, సుధాకర్, పెనుకుల ఐలయ్య, యాదగిరి, కనకయ్య, సారంగపాణి, స్టాలిన్, రాజేందర్, యాదగిరి పాల్గొన్నారు.
55వ డివిజన్లో..
భీమారం/హసన్పర్తి : గ్రేటర్ 55వ డివిజన్లోని ఎర్రగట్టు గుట్ట మత్రపురి కాలనీ, భీమారం, చింతగట్టు, మునిపల్లి, సదానంద కాలనీలో రూ.3.50కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్, శ్మశానవాటికల నిర్మాణ పనులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమారం గ్రామాన్ని రూ.30.50కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, భీమారం బస్టాప్ వద్ద ఎమ్మెల్యేకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గడ్డం శివరాం ప్రసాద్, పాపిశెట్టి శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, ఎర్రగట్టుగుట్ట దేవస్థానం మాజీ చైర్మన్ అటికం రవీందర్, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సంగాల విక్టర్బాబు, మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్కుమార్, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ రాజునాయక్, టీఆర్ఎస్ నాయకులు ఆకుల కుమార్, రాయకంటి సురేశ్, నాయకపు శ్రీనివాస్, సంగాల థామస్, అటికం సురేందర్, ఏరుకొండ శ్రీనివాస్, చంద్రమోహన్, సుభాష్గౌడ్, మల్లారెడ్డి, నద్దునూరి నాగరాజు, నేదునూరి కుమారస్వామి, సాగర్, సాంబయ్యనాయక్, రమేశ్ నాయక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
టాలీవుడ్కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?