అర్ధ పానవట్ట లింగానికి అన్నపూజ
స్వామి వారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
బ్రహ్మోత్సవాలు ముగింపు
ఉగాది వరకు వారాంతపు జాతరలు
ఐనవోలు జనవరి 17: సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. నాలుగు రోజులపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకా క దేవాలయం ఆవరణలో బోనాలు చేయడం, పట్నాలు వేయడంతోపాటుగా లక్షలాది మంది భక్తులు విడిది చేశా రు. దీంతో ఆలయం ఆవరణ, పరిసరాలు, గర్భాలయం లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో సంప్రదాయం ప్రకారం ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీంద ర్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పవిత్రమైన జలంతో తెల్లవారుజామునుంచే మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి, రేణుకా ఎల్లమ్మ దేవాలయాలను సంప్రోక్షణ చేశారు. స్వచ్ఛమైన జలం, సుగంధద్రవ్యాలు, నవధాన్యా లను మిలితం చేసి మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగ ణం చుట్టూ తిరుగుతూ చల్లారు. అనంతరం ఆలయంలో ఉన్న అర్ధప్రానవట్టం లింగానికి అన్నపూజ నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదం వితరణ చేశారు. శివలింగాన్ని శివుడి ఆకారంలో అన్నంతో అలంకరించారు. దీంతో ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్య క్రమంలో ఈవో నాగేశ్వర్రావు, ఎస్సై మోదుగు భరత్, చైర్మన్ మునిగాల సంపత్కుమార్, వేద పండితులు పురు షోత్తంశర్మ, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్శర్మ, అర్చకులు మధుశర్మ, నరేశ్శర్మ(చిక్క), భానుశర్మ, శ్రీనివాస్శర్మ, సిబ్బంది కిరణ్, మధుకర్, నారాయణరావు, శ్రీకాంత్, రాజు, కన్న య్య, రాజు, రాజులు, డైరెక్టర్లు వెంకట్ రెడ్డి, రాజు, సతీశ్, దేవేంద్ర, ప్రతాప్ పాల్గొన్నారు.
స్వామికి పట్టువస్ర్తాలు సమర్పణ
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ గ్రామస్తు లు ఉమామహేశ్వర్ దేవాలయం నుంచి స్వామి వారికి ప్రతి సంవత్సరం పట్టువస్ర్తాలు సమర్పించడం అనవాయి తీగా వస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం కూనూర్ సర్పంచ్ ఇల్లందుల కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ స్తులు అజయ్ తదితరులు డప్పుచప్పుళ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్కు పట్టువస్ర్తాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకుడు సదాశివశర్మ, రాజు పాల్గొన్నారు.