రాయపర్తి, జూలై 13: రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాలన అందిస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్లో 50 మంది రైతులకు మంజూరైన రూ. 2 కోట్ల విలువైన చెక్కులను మంగళవారం వర్ధన్నపేటలోని డీసీసీబీ ఆవరణలో ఎంపీపీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల ఏలుబడిలో తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన వ్యవసాయరంగాన్ని నేడు పండుగ వాతావరణంలోకి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పీఏసీఎస్లు, డీసీసీబీలు అందిస్తున్న సేవలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి రుణం అవసరమున్నా నేరుగా బ్యాంకు మేనేజర్ను మాత్రమే సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్ క్యాతం శ్రవణ్కుమార్, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, సీఈవో ఏడాకుల సోమిరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ రంగు సురేశ్కుమార్, గడ్డం యాకాంతం, అయిత మల్లేశ్, సంగెం రాకేశ్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎంపీపీ
మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీలో హరితహారంలో భాగంగా సర్పంచ్ చెడుపాక కుమారస్వామితో కలిసి ఎంపీపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంతోష్గౌడ్, జగన్నాయక్, ఎల్లయ్య, మహేందర్, కార్యదర్శి వీరేందర్నాయక్, కారోబార్ మహాత్మా, మల్లేశ్, సోమక్క, వీరయ్య, యాకయ్య, రవి, ఉప్పలయ్య, ప్రభాకర్, మధు పాల్గొన్నారు.