హైదరాడాద్ : ఎన్నికల కోడ్(Election code) ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై వేటుపడింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగి తులసిని సస్పెండ్(Tulasi suspended) చేస్తూ డీఈ కాళిదాసు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి(Peddapalli) జిల్లా గోదావరిఖనిలోని బృందావన్ గార్డెన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పలువురు కార్మిక నాయకులతోపాటు టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎంఆర్టీ డివిజన్లో టెస్టర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తులసి కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతోపాటు మంత్రి శ్రీధర్బాబుతో వేదికను పంచుకొని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.ఈ ఘటనపై పలువురు విమర్శలు గుప్పించడంతో విచారణ చేపట్టిన అధికారులు ఈ మేరకు క్రమ శిక్షణారాహిత్యానికి పాల్పడిన తులసిని సస్పెండ్ చేశారు.