నర్మెట : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని హాన్మంతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత రైతులకు ఉచితంగా విద్యుత్ను 24 గంటల పాటు అందిస్తుందని అన్నారు. రైతు బంధు, రైతుబీమాలాంటి సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో రైతులు సంక్షేమానికి సీఎం కేసీఆర్ మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నారని అన్నారు.
గతంలో జనగామ నియోజకవర్గంలోనే 12 సబ్స్టేషన్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం హాయంలో సీఎం కేసీఆర్ ఆమోదంతో జరిగిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్రంలో అనవసర రాద్ధాంతాలు చేస్తూ కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని గుర్తించడం లేదని అన్నారు.
బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మాట్లాడాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, సర్పంచ్లు పగడాల విజయ నర్సయ్య, బానోత్ రజిత రవి, బానోత్ శంకర్నాయక్, ఆమెడపు కమలాకర్రెడ్డి, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, ఎస్ఈ మల్లికార్జున్, డీఈ సదానందం, ఏడీఈ మనోహర్రెడ్డి, ఏఈ అశోక్, సబ్ ఇంజనీర్ మణిదీప్, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.