వరంగల్, ఏప్రిల్ 23(నమస్తేతెలంగాణ)/మహబూబాబాద్: వరంగల్లో 7, మహ బూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి 6 నామి నేషన్లు దాఖలయ్యాయి. వరంగల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ఇల్లందుల శోభన్బాబు, కొంగర అనిల్కుమార్, కుమ్మరి కనకయ్య, పోతరాజు నరసింహరాజు, చెలుముల్ల సుజాత, పొగాకుల అశోక్, విదుథలై కాచి పార్టీ అభ్యర్థి మచ్చ దేవేందర్ తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్యకు అందజేశారు. మహబూ బాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరఫున మాలోత్ కవిత నామినేష న్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా బానోత్ భావ్సింగ్, పోరిక శ్యామల నాయక్, ఆధార్ పార్టీ అభ్యర్థిగా జాటోత్ రవివర్మ మరోమారు నామినే షన్ దాఖలు చేశారు. ఆదివాసీ జేఏసీ తరఫున చందా లింగయ్య, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ నామినేషన్ పత్రాలను ఆర్వో, కలెక్టర్ అద్వైతకుమార్సింగ్కు అందజేశారు.
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 23 : ‘మానుకోట ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. వారిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా బలం, బలగం నా పార్టీ కార్యకర్తలే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సైనికుల్లా పని చేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించాలి. ప్రతి ఒక్కరు సమన్వయంతో ముందుకుసాగాల’ని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం రేవంత్రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఆ విషయం మొన్నటి మానుకోట సభతోనే అర్థమైపోయిందని, అలాగే పదేళ్ల మోదీ సర్కారు పాలనతో పేదల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. మంగళవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కవిత నామినేషన్ వేశారు.
అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నదని ఎంపీ కవిత అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కాంగ్రెస్ అమలు చేయలేదని, ఫలితంగా రాష్ట్రంలో సాగు, తాగునీరు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఆ విషయం మానుకోట సభతో కాంగ్రెస్ నాయకులకు అర్థం అయిపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని, మొదట డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి మాట మార్చి ఇప్పుడు ఆగస్టు 15న చేస్తానని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు. బీజేపీ వివిధ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ పేదలకు చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చీరాగానే
కేసీఆర్ హయాంలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికీ రైతుబంధు అందక రాష్ట్రంలోని చాలామంది రైతులు అరిగోస పడుతున్నారు. పంటలు ఎండిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకోవాలి. కేసీఆర్ నేతృత్వంలో ప్రతి తండాకు, గూడేనికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారు. కాంగ్రెస్ వచ్చి నీటి తండ్లాట తెచ్చింది. అలాగే కేంద్రంలో పదేళ్లుగా మోదీ సర్కారు కార్మికులు, కర్షకులను అనేక ఇబ్బందులు పెట్టింది. బీజేపీ విధానాలు కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నాయే తప్ప పేదలకు మాత్రం న్యాయం చేయడం లేదు.
కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. తండాలను ప్రత్యేక జీపీలుగా చేయడం వల్ల ఎంతో మందికి సర్పంచ్లు అయ్యే అవకాశం వచ్చింది. ఈ ప్రాంత గిరిజన ప్రజల కోసం మెడికల్ కళాశాల, హార్టికల్చర్, నర్సింగ్, ఇంజినీరింగ్ కళాశాలను తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, కార్మికులు, దళితులు సుఖసంతోషాలతో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు కష్టాలు తెచ్చింది. ప్రజలకు అనేక వాగ్ధ్దానాలు చేసి నట్టేట ముంచింది. అందుకే ఇప్పుడు అందరూ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు.
కేసీఆర్ పాలనలో ప్రతి పేద వాడికి న్యాయం జరిగింది. మండువేసవిలోనూ ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువులను నింపిన ఘనత ఆయనదే. ప్రతి ఎకరాకు నీరందించి, పంటలకు కనీస మద్దతు ధర అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను సాకుగా చూపి ప్రజలను మోసం చేస్తున్నది. అందుకే సీఎం రేవంత్రెడ్డికి ఆదరణ తగ్గింది. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్లు అంగోత్ బిందు, బడే నాగజ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, హరిప్రియా నాయక్, రేగా కాంతారావు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్కాల శ్రీనివాసరెడ్డి, ముత్యం వెంకన్న పాల్గొన్నారు.