జనగామ : పోషక విలువలున్న మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం జనగామలోని రైల్వేస్టేషన్ నుంచి బతుకమ్మకుంట వరకు రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె రన్ పోటీలను డీసీపీ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బతుకమ్మకుంటలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంక్ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, ఇంట్లో తయారు చేసిన ఆహారం, ఇతర పదార్థల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల చదువులతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని, మంచి ఆహారం పిల్లలకు మితంగా తినడం అలవాటు చేయాలని, అప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. జనగామ పట్టణంలో క్రీడాకారులు, పిల్లలకు ఒకప్పుడు ఆట స్థలం లేని పరిస్థితుల నుంచి మినీస్టేడియం, ఇండోర్ స్టేడియం వరకు వచ్చమన్నారు. ఫలితంగానే ఇప్పుడు పిల్లల్లో క్రీడాసక్తి పెరిగిందన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు వాంకుడోతు అనిత, బొట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మల్లిగారి రాజు, ఉల్లెంగుల నర్సింగ్ పాల్గొన్నారు.