ఒక్కో మార్కెట్కు ఐదు ఎకరాలు
స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
లక్ష్మీనగర్ మార్కెట్కు రూ.24 కోట్లు మంజూరు
వరంగల్, మార్చి 28 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఐదు మోడల్ మార్కెట్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి హన్మకొండలోని ఆర్అండ్బీ కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో పాటు నక్కలగుట్ట పాత ఇరిగేషన్ కార్యాలయం, వరంగల్లోని పశు సంవర్థక శాఖ కార్యాలయంలోని స్థలాలను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా నగరంలో ఐదు మోడల్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారన్నారు. ఒక్కో మార్కెట్ను సుమారు 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తామన్నారు. మార్కెట్లో మరుగుదొడ్లు, పార్కింగ్ ఏర్పా టు చేయాలన్నారు. వరంగల్లోని లక్ష్మీపురంలో వెజ్, నాన్వెజ్ మోడల్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాజీపేట పాత మార్కెట్, చిం తగట్టు కెనాల్ వద్ద స్థలం అందుబాటులో ఉందని, పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ రాజం, డీఈ నరేందర్, ఏసీపీ ప్రకాశ్రెడ్డి ఉన్నారు.
పాల్కురికి సోమనాథుడు విశ్వకవి..
పాలకుర్తి : జ్ఞానసంపన్నుడైన పాల్కురికి సోమనాథుడు విశ్వకవి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలోని సోమనాథ కళాపీఠం దేవస్థాన ఆధ్వర్యంలో ఆదివారం పాల్కురికి సోమనాథుడి 782వ లింగైక్యతిథి దీపారాధనలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. తొలుత సోమనాథుడి విగ్రహం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి పూలమాల వేశారు. కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దక్షిణాది భాషలే కాక సంస్కృతం, మరాఠీ భాషల్లో సోమనాథుడు రాసిన కవిత్వాలు ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనమన్నారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవోఎం వీరస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పస్నూరి నవీన్కుమార్, అర్చకులు దేవగిరి రామన్న, అర్చక మతైక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ, నాగరాజు, అనిల్శర్మ, సంతోష్శ ర్మ, శ్యాం, చిక్కమఠం పర్వతప్ప, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ముంజ రాములు, బండారి శ్రీనివాస్, మార్గం లక్ష్మీనారాయణ, రాజు సాంబయ్య, కళాపీఠం అధ్యక్షురాలు శోభారాణి, నాగన్న, దామోదర్, సోంసాయి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జీతం పెరిగిందా.. పొదుపు చేయండిలా
కూలర్’ కోసం కొన్ని చిట్కాలు..