ఆత్మకూరు/దామెర, జూన్ 20: పల్లెప్రగతి పనులు శాశ్వతంగా, పటిష్టంగా ఉండేలా బాధ్యతగా చేపట్టాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. ఆత్మకూరు, దామెర మండలాల్లోని గూడెప్పాడ్, ఆత్మకూరు, ఊరుగొండ దామెర గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఆత్మకూరు మండలం జిల్లాకే ఆదర్శంగా నిలిచేలా సర్పంచ్లు, కార్యదర్శులు అంకితభావంతో పని చేయాలని ఆయన సూచించారు. పల్లెప్రకృతి వనాన్ని చెరువుకట్ట వద్ద ఏర్పాటు చేయడం వల్ల ఆహ్లాదకరంగా ఉందన్నారు.
ఈ స్థలాన్ని ఎంపిక చేయడంపై సర్పంచ్ రాజును అదనపు కలెక్టర్ అభినందించారు. ఆత్మకూరు, గూడెప్పాడ్లో పారిశుధ్య పనుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన రహదారులకిరువైపులా, వైకుంఠధామం వద్ద మొక్కలను నాటాలన్నారు. అన్ని గ్రామాల్లో మొక్కలను నాటేందుకు గుంతలను తీసి సిద్ధం చేసుకోవాలని ఈజీఎస్ అధికారులకు ఆదేశించారు. ఊరుగొండ, దామెర గ్రామాల్లో పాడుబడిన ఇండ్లను కూల్చివేయడం వంటి పనులను అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు నర్మద, వెంకటేశ్వర్రావు, ఎంపీవో ప్రభాకర్, ఏపీవో రాజిరెడ్డి, సర్పంచ్లు పర్వతగిరి రాజు, బీరం శ్రీలత రామకృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఉపసర్పంచ్ వీసం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శులు క్రాంతి, యాదగిరి, మనోహర్రెడ్డి, బుచ్చిరెడ్డి, సునీల్, నరేశ్, మాజీ ఎంపీటీసీ వాసు, రవి పాల్గొన్నారు.