గీసుగొండ, జూన్ 14: హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని పీడీ సంపత్రావు అన్నారు. దస్రుతండాలోని విలేజ్పార్కు, నర్సరీని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపాధి పనుల్లో భాగంగా గుంతలు తవ్వించాలని సూచించారు. మండలంలోని 21 గ్రామాల నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈజీఎస్ పనులను ఏడాది పొడవునా చేయించాలని సూచించారు. కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కార్యదర్శులపై వేటు తప్పదన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత, మొక్కల పెంపకం, హరితహారం, ఈజీఎస్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆయన వెంట ఎంపీవో ధనలక్ష్మి, ఏపీవో మోహన్రావు, సర్పంచ్ కేలోతు సరోజన, వార్డు సభ్యులు పాల్గొన్నారు.