రఘునాథపల్లి జూన్ 8 : కొవిడ్ బాధితులు ఆత్మైస్థెర్యాన్నికోల్పోవద్దు. ధైర్యంగా ఉండి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే త్వరగా తగ్గి పోతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. మండలంలోని అయ్యావారిగూడెంలో పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇటీవల మృతి చెందిన పా ర్నంది పోషయ్య దివ్యాంగుడి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసులు గ్రామాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొవిడ్ బాధితులు బయపడాల్సినవసరంలేదని, ప్రభుత్వ అన్ని వి ధాలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం కొ విడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్నంది కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వై కుమార్గౌడ్, మహిళా మండలాధ్యక్షురాలు మడ్లపల్లి సునిత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గొరిగె రవి, నియోజవర్గ ప్రచార కార్యదర్శి తాటికొండ వెంకటేశ్యాదవ్, మడ్లపల్లి రాజు, యూత్ నాయకులు కుర్ర కమలాకర్, వారాల రమేశ్యాదవ్, నాయకులు కంతి భాస్కర్, ఉపసర్పంచ్ సుజాత, పంచాయతీ కార్యదర్శి విజయ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.