అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
జనగామ రూరల్, మే 25: వచ్చే హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పసరమడ్ల, ఓబుల్కేశ్వాపూర్లో నర్సరీ, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, ఉపాధిహామీ పనులు, జ్వరసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండకు మొక్క లు వాడిపోకుండా సంరక్షించాలని జీపీ సిబ్బందికి సూచించారు. కూలీలు పని చేస్తున్న ప్రదేశంలో తాగునీరు, ప్రాథమిక కిట్లు అందుబాటులో ఉండాలని ఈజీఎస్ సిబ్బందికి సూచిం చారు. రెండు రోజుల్లో తడి, పొడి చెత్త నిర్వహణ చేపట్టాలన్నారు. ఇంటింటా జ్వరసర్వేను ప్రజలు వినియోగించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. లక్షణాలున్న వారికి ఆరోగ్య కిట్లను అందించి ప్రతిరోజూ వారి బాగోగులు ఎలా ఉన్నాయే తెలుసుకోవాలన్నారు. అవసరమైతే బాధితులను మెరుగైన చికిత్స కోసం జిల్లా దవాఖానకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బిరుదు హిమబిందు, ఎంపీవో ఉప్పుగల్లు సంపత్కుమార్, సర్పంచ్ శివరాత్రి స్వప్నరాజు, ఏపీవో చిక్కుడు భిక్షపతి, ఈసీ మాధవరెడ్డి, కార్యదర్శి శ్యామల పాల్గొన్నారు.