సాగును పండుగ చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్
పల్లెప్రగతిలో పనిచేసిన సర్పంచ్లకు సన్మానం
పనిచేయని వారిపై చర్యలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కాపులకనపర్తి నుంచి సంగెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
సంగెం, జూన్ 28 : రైతులకు ఎదురుపెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని పండుగ చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మండలంలోని కాపులకనపర్తి నుంచి సంగెం మండల కేంద్రం వరకు రూ.4.97కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రకం పేరుతో శిస్తు వసూలు చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం శిస్తును రద్దు చేసి రైతులకు ఎదురుపెట్టుబడి ఇస్తున్నదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రంలోని ప్రతి చెరువునూ నింపి భూములను సస్యశ్యామలం చేసి బంగారు తెలంగాణ నిర్మాణమే ద్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. జూలై 1 నుంచి 10వ తేదీ వర కు పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ప్రజ లు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. పల్లెప్రగతిలో భాగంగా ఉత్తమ గ్రామాలను గుర్తించి సర్పంచ్లు, అధికారులను సన్మానించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పనులు చేయని సర్పంచ్లపై చర్యలుంటాయని హెచ్చరించారు. సర్పంచ్లు అప్పులపాలు కావొద్దనే జీపీ గ్రాంట్ నుంచి తీర్మానం చేసి రూ.50 లక్షల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. పల్లెప్రగతిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందిన పది గ్రామాలకు జీపీ భవనాలు మంజూరు చేయిస్తానన్నారు.
గ్రీన్ఫీల్డ్ హైవేతోభూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాపులకనపర్తి – సంగెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం వల్ల కాట్రపల్లి గ్రామంలో ఇండ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానన్నారు. కాట్రపల్లి గ్రామస్తులు సహకరించాలని కోరారు. మచ్చాపూర్, మొండ్రాయి మీదుగా కొత్తపెల్లి వరకు బీటీ డబుల్ రోడ్డు, సంగెంలో గెస్ట్హౌస్ నిర్మాణానికి రూ.3కోట్ల మంజూరు చేయించాలని, దేవాదుల నీటి కోసం వెంకటాపురం వరకు భూ సేకరణ చేయించాలని, గ్రీన్ఫీల్డ్ హైవేతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇప్పించాలని మంత్రి ఎర్రబెల్లికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నరహరి, పీఆర్ఈఈ శంకరయ్య, ఎంపీడీవో మల్లేశం, సర్పంచ్లు ఎర్రబెల్లి గోపాల్రావు, పులుగు సాగర్రెడ్డి, దొనికెల రమాశ్రీనివాస్, కావటి వెంకటయ్య, ఎంపీటీసీలు సుతారి బాలకృష్ణ, గాయపు ప్రచూర్ణాభాస్కర్రెడ్డి, గుగులోత్ వీరమ్మగోపీసింగ్, పీఏసీఎస్ చైర్మన్లు సంపత్గౌడ్, కుమారస్వామి, మండల అధ్యక్షుడు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
\