గాంధారి, ఏప్రిల్ 19: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు చేదు అనుభవం ఎదురైంది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మదన్మోహన్రావు సేజీపైకి వెళ్లగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. స్టేజీ దిగి వెళ్లిపోవాలని కోరారు. అందరూ కలిసి జరుపుకొనే పండుగలో రాజకీయాలు వద్దంటూ వారించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వీడియోలు వైరల్ కావడంతో మండలంలోని అన్ని వాట్సాప్ గూపుల్లో చక్కర్లు కొట్టడం గమనార్హం.