హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 19 : ‘దళిత ద్రోహి కడియం శ్రీహరి.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో నిలబడు.. నువ్వో నేనో ఇద్దరం తేల్చుకుందాం. నా ఏకైక లక్ష్యం నీ పతనమే’అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియంపై నిప్పులు చెరిగారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. దళిత ద్రోహి కడియంపై మూడుసార్లు 12వేలు, 33వేలు, 58వేల మెజార్టీతో గెలిచానని, 2009లో స్టేషన్ ఘన్పూర్లో శ్రీహరిపై గెలిస్తే దుర్మార్గుడిని ఓడించావని వైఎస్ రాజశేఖర్రెడ్డి తనను మెచ్చుకున్నాడని, కాంగ్రెస్లో ఉండి ఎంజీఎం దవాఖానలో జై తెలంగాణ అన్నానని గుర్తుచేశారు. దేవుడి లాంటి కేసీఆర్ తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే మళ్లీ తన వెనకాలే వచ్చి లేనిపోని మాటలు చెప్పి, కుట్రలు, కుతంత్రాలు చేసి తన పదవి లాక్కున్నాడని విమర్శించారు. కొనఊపిరితో ఉన్న తనకు కేసీఆర్ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని, తన పని నమ్మకద్రోహి కడియం శ్రీహరి అంతు చూడడమేనన్నారు. తనను రాజకీయాల్లోకి ప్రణయ్భాసర్ ఆహ్వానించారని, టీడీపీ హయాంలో స్టేషన్ ఘన్పూర్లో నిలబడమని అడిగితే తిరసరించి కడియం పేరు ప్రతిపాదించానని, ఇప్పుడు చింతిస్తున్నానని తెలిపారు. పశ్చిమ నుంచే మళ్లీ గులాబీ జెండా ఎగిరే ఉద్యమం మొదలవ్వాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం వరంగల్ వైపు చూస్తోందని, బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిపిన సుధీర్కుమార్ను గెలిపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
నేను పార్టీ కార్యకర్తనే. కేసీఆర్ వెంట 2001 నుంచి నడిచాను. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కడియం శ్రీహరికి నాకు మధ్య. నాకు పోటీ కడియం కావ్య కాదు. నేను జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను. కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరం బరిలో నిలిచి గెలుపెవరిదో తేల్చుకుందాం. యువత ఆలోచించాలి.. పదేండ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, కేంద్రంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేయండి. మోదీ ఏ వర్గానికి చేసింది ఏమీ లేదు. కడియం-అరూరి గురుశిష్యులు. రెండు పాములు ఒకే పుట్టలో నుంచి వచ్చాయి. తెలంగాణ కోసం కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి. మొదటిసారి అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని వాడిన ప్రణయ్ అన్నకు జోహార్లు.
పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజాక్షేత్రంలో బరాబర్ ఎండగడుతాం. కడియం వ్యవహారశైలి పచ్చని చేను కాడ దొబ్బితింటా.. వెచ్చగా పంట అనే తీరు. ఎమ్మెల్యే పదవి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష. వెంటనే పదవికి రాజీనామా చేయాలి. ధైర్యం ఉంటే పోటీలో నిలబడాలి. వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఆనాడు స్టేషన్ ఘన్పూర్కు చెందిన బొజ్జపెల్లి రాజయ్య, తాటికొండ రాజయ్యలపై కుట్ర చేసిండు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కాళ్లు మొకి మంత్రి పదవి తెచ్చుకున్నడు. అనంతరం వారిద్దరికీ వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పంచన చేరిండు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ చేరదీశారు. కానీ పార్టీకి ద్రోహం చేసిండు. కాంగ్రెస్ శాసనసభ్యులు నాలుగు నెలల్లో నాలుగు రూపాయలు తేలే. పార్టీ కార్యాలయం జోలికి వస్తే ఊరుకోం.
కడియం కావ్యకు టికెట్ ఇచ్చాక మోసం చేసి పార్టీ మారారు. కాంగ్రెస్కు ఓట్లు వేసి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. నెలలో మరమ్మతులు చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్కు పరిపాలించే విజ్ఞత లేదు. సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
కడియం శ్రీహరి, అరూరి రమేశ్ ఇద్దరూ ద్రోహులే. కాంగ్రెస్ వాళ్లు కసిగా ఉన్నారు కావ్యను ఓడించడానికి.. బీజేపీ, కాంగ్రెస్సోళ్లే సుధీర్ కుమార్ని గెలిపించాలనుకుంటున్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో తాటికొండ రాజయ్య కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. ‘దేఖ్లేంగే.. ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా’ పాటకు రాజయ్య విజిల్ వేస్తూ నృత్యం చేశాడు. సమావేశంలో కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్రావు, చెన్నం మధు, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, నాయకులు పులి రజినీకాంత్, డివిజన్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి చందర్, కంజర్ల మనోజ్కుమార్ పాల్గొన్నారు.