రామగిరి, అక్టోబర్ 21 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాబోయే రోజుల్లో సింగరేణినీ అమ్ముతారనడంలో సందేహం లేదని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దొమ్మటి కొమురయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్జీ-3 పరిధిలోని గనులపై గురువారం నిరసనలు చేపట్టారు. ఓసీపీ-2లో కొమురయ్య మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశంలోని కోల్ బ్లాకులను అమ్మకానికి పెట్టడానికే కంకణం కట్టుకుందన్నారు. భవిష్యత్లో సింగరేణిని కూడా అమ్ముతుందనడంలో సందేహం లేదన్నారు. సిం గరేణిలో ఉన్న నాలుగు బ్లాకులను ప్రైవేట్ వారికి అప్పజెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం బిడ్డింగ్లో పెట్టిందని తెలిపారు. కార్మిక వర్గం పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఈ కుమార్, రాజయ్య, రాయమల్లు, దేవేంద్రచారి, రమణారెడ్డి, వెంకటేశ్వర్లు, కార్మికులున్నారు.
గోదావరిఖని, అక్టోబర్ 21 : బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్జీ-1 పరిధిలో ని జీడీకే-1,2,2ఏ,11, సీఎస్పీ-1 వర్క్షాపులలో గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం దేశం లో 88 బొగ్గు బ్లాకులను, అందులో సింగరేణికి సంబంధించి 4 బ్లాకులను వేలం వేయనుంద న్నారు. వాటిని విరమించుకోవాలని డిమాండ్చేశారు. నాయకులు మేదరి సారయ్య, మెండె శ్రీనివాస్, ఆసరి మహేశ్, వేణుగోపాల్ రెడ్డి, గజేంద్ర, కారం సత్తయ్య, వంగల రాములు, శివరాంరెడ్డి, దుర్గా ప్రసాద్, లక్ష్మణ్, భీమా నాయక్, రవీందర్ రెడ్డి, శంకరయ్య, నంది నారాయణ, రవి, అన్నం శ్రీనివాస్, బుగ్గారం శ్రీనివాస రావు, ఇప్పలపల్లి సతీశ్, దేవేంద్ర, రమేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.