న్యూఢిల్లీ, జూలై 3: ఫేస్బుక్, గూగుల్పై కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆ సంస్థలు మొదటి పారదర్శక నివేదిక (కంప్లయన్స్ రిపోర్టు)ను విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకత సాధించే దిశగా ఇది గొప్ప ముందడుగు అని ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా కేంద్ర మంత్రి రవిశంకర్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ల ట్విట్టర్ ఖాతాల నిలుపుదలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని గత మంగళవారం పార్లమెంటరీ స్థాయి సంఘం ఆదేశించినా ఇప్పటివరకు ట్విట్టర్ వివరణ ఇవ్వలేదని స్టాండింగ్ కమిటీ తెలిపింది.