Jangaon
- Oct 05, 2020 , 06:26:22
VIDEOS
రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్

జనగామ క్రైం, అక్టోబర్ 4 : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లతో పాటు వరంగల్-హైదరాబాద్ రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడగా సంబంధిత అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు మరమ్మతు పనులను జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలతో రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రోడ్లపై గుంతలు పడిన చోట మరమ్మతు పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారని తెలిపారు. దీంతో మరమ్మతు పనులు చేపట్టారని జమున వివరించారు. ఆమె వెంట ఎస్సై కాసర్ల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు పోకల లింగయ్య, కాంట్రాక్టర్ శశిధర్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
MOST READ
TRENDING