భూపాలపల్లి టౌన్, జూలై 19: కడు నిరుపేదరికంలో ఉన్న కుమారులు అవ్వకు పట్టెడన్నం పెట్టలేని దీనస్థితి. కాగా, వృద్ధురాలు గ్రా మంలోని పంచాయ తీ ఆవరణ లో తలదాచుకుంటున్న వృద్ధురాలిని సర్పంచ్ చేరదీసిన ఘటన మండంలోని రాంపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నలుబోతుల లచ్చుకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నలుగురు కుమారులు గ్రామంలోనే కూలి పని చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధురాలికి ప్రభుత్వం అందించే పింఛన్ వచ్చినన్ని రోజులు ఇబ్బంది లేదు. కానీ, వృద్ధురాలు ఆధార్ కార్డు పోగొట్టుకోవడంతో ఏడాది కాలంగా పింఛన్ రాక ఇబ్బంది పడుతున్నది. వృద్ధురాలు, కొడుకులు ఆధార్ కార్డు లేని విషయం ఎవరికీ చెప్పు కోలేదు. కాగా, నాలుగు రోజులుగా వృద్ధురాలు తిండి లేక గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుని అల మటిస్తున్న విషయం తెలుసుకున్న సర్పంచ్ టీ వెంకన్న ఆమెకు పంచాయతీ గదిలో ఆశ్రయం కల్పించి, భోజనం పెట్టిస్తున్నాడు. అలాగే అవ్వ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆధార్కార్డు ఇప్పించి పింఛన్కు మార్గం సుగమం చేశాడు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వృద్ధురాలిని ఆదుకోవాలని సర్పంచ్ వెంకన్న కోరారు.