జగిత్యాల : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో రూ. 10 లక్ష వ్యయంతో సీసీ రోడ్డు కు శంకుస్థాపన చేసిన అనంతరం 4వ విడత పల్లె ప్రగతిని ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. గ్రామాల్లో ఎక్కడ చెత్త ఉండకూడదని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటి ముందు 6 మొక్కలు నాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకర్, జడ్పీటీసీ గొస్కుల జలేందర్, మిల్కూరి అనసూర్య చంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లింగారెడ్డి, వైస్ ఎంపీపీ ఆవులు సత్యం, పీఏసీఎస్ ఛైర్మన్ లు రాజు సుమన్ రావు, మాధవ రావు, మార్కెట్ వైస్ చైర్మన్ గంగాధర్, మండల పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్ తదితరులు పాల్గొన్నారు.