దళారులకు విక్రయించి నష్టపోవద్దు
జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి
శంకరపట్నం, ఏప్రిల్ 22: రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డులో హుజూరాబాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిర్వాహకులు ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు జరుపాలని చెప్పారు. సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే వేసవిని దృష్టిలో పెట్టుకొని రైతులకు తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్రావు, ఎంపీడీవో భీమేశ్, ఏవో ఆర్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ అంతం కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, టీఆర్ఎస్ నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, బర్మావత్ యాదగిరి, రైతులు పాల్గొన్నారు.
కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
తిమ్మాపూర్, ఏప్రిల్ 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ అలువాల కోటి సూచించారు. గురువారం మండలంలోని రేణికుంట, నుస్తులాపూర్, రామకృష్ణ్ణకాలనీ, ఇందిరానగర్, మొగిలిపాలెం, పర్లపల్లి, తదితర గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచులు రావుల రమేశ్, మాదాడి భారతి, మీసాల అంజయ్య, కాటిక వినోద, మోరపల్లి సుస్మిత, ఎంపీటీసీలు కొత్త తిరుపతిరెడ్డి, పాశం తిలక్ప్రియ, ముప్పిడి సంపత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దుండ్ర రాజయ్య యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సొంతింటి కోసం అకస్మాత్గా పెరిగిన డిమాండ్!
Tollywood : కరోనాతో టాలీవుడ్కు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా