కాల్వశ్రీరాంపూర్, జూలై2: దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని సర్పంచులు భైరం రమేశ్, గోనే శ్యాం కొనియాడారు. దళితుల అభ్యున్నతికి దళిత సాధికారిత పథకం ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాదాసి రాంచంద్రం, చలిగంటి రాంచంద్రం, బోయిని సదానందం, వెలుతురు రమేశ్, బొల్లి ప్రేమ్కుమార్, శనిగరపు రామస్వామి, మొలుగూరి రమేశ్, శ్యాం, పురుషోత్తం, సాయి, కుంట శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ఓదెల, జూలై 2: కొలనూర్లోని దళిత కాలనీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. దళిత సాధికారత పథకం ద్వారా దళిత పేదలు ఆర్థికంగా బలపడుతారని పేర్కొన్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్ బండారి ఐలయ్యయాదవ్, ఉప సర్పంచ్ పాకాల సంపత్రెడ్డి, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, ఓదెల నరేందర్, లక్ష్మారెడ్డి, నాయకులు దొడ్డె శంకర్, మద్దెల నర్సయ్య, సాత్తూరి రాజేశం, సాత్తూరి రవి తదితరులు పాల్గొన్నారు.
పథకంపై హర్షం
కోల్సిటీ, జూలై 2: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత క్రాంతి పథకం చారిత్రాత్మకమని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు వాసంపల్లి ఆనంద్ బాబు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఏటా నియోజక వర్గంలో వంద మందిని గుర్తిస్తారని తెలిపారు. దళిత సాధికారత పథకం తీసుకువచ్చి రూ.10లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయ నున్నారని పేర్కొన్నారు. ఈ పథకంతో సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో ఆత్మగౌరవం నింపారని పేర్కొన్నారు. వారిని ఆర్థిక సంపన్నులుగా తీర్చిదిద్దే గొప్ప లక్ష్యంతో ఈ పథకం తీసుకురావడంపై కృతజ్ఞతలు తెలిపారు.