వాషింగ్టన్, సెప్టెంబర్ 27: కరోనా మూలాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్వో) మళ్లీ దర్యాప్తునకు సిద్ధమైంది. గతంలో దర్యాప్తు నిర్వహించిన వారు కాకుండా ఈ సారి పూర్తిగా మరో కొత్త బృందంతో దర్యాప్తు జరుపనున్నది. ఈ బృందంలో దాదాపు 20 మంది శాస్త్రవేత్తలున్నారు. వీరు కేవలం చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దర్యాప్తు చేయనున్నారు. కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో గతంలో దర్యాప్తు నిర్వహించి.. వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చింది అనడానికి ఆధారాల్లేవని ప్రకటించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. మళ్లీ దర్యాప్తు నిర్వహించాలని పలుదేశాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్వో మళ్లీ దర్యాప్తు చేస్తున్నది.