న్యూయార్క్, సెప్టెంబర్ 23: ప్రతిరోజూ వాల్నట్స్ తినడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, శరీరం బరువు పెరుగడం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. అలాగే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా తగ్గిస్తుందని వెల్లడైంది.
వాల్నట్స్ తినని వారికంటే తినేవారిలో బీపీ తక్కువగా ఉన్నట్టు తేలిందని అధ్యయనం వివరించింది. నట్స్లో ఒమేగా-3 ఆల్ఫా-లినోలెకిన్ యాసిడ్(ఏఎల్ఏ) ఉండేది ఒక్క వాల్నట్స్లో మాత్రమేనని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు చెప్పారు. 45 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన 3,341 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు.