వాటికన్ సిటీ, మే 15: తొలిసారి భారత్కు చెందిన సామాన్య వ్యక్తి దేవసహాయానికి సెయింట్హుడ్ హోదా దక్కింది. వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రకటన చేశారు.
దేవసహాయంతో పాటు మరో 9 మందికి సెయింట్ హుడ్ ప్రదానం చేశారు. దేవసహాయం 1712 ఏప్రిల్ 23న హిందూ నాయర్ కుటుంబంలో అప్పటి ట్రావెన్కోర్ రాజ్యంలో కన్యాకుమారి జిల్లా నట్టాలంలో జన్మించారు. తన 33వ ఏట క్రైస్తవాన్ని స్వీకరించారు. అప్పట్లోనే ఆయన కులానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడారు. 1752 జనవరి 14న ఆయన తుపాకీ కాల్పుల్లో మరణించారు.