న్యూయార్క్ : భారత్, పాకిస్తాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు, అర్ధవంతమైన సంప్రదింపులు జరిగేందుకు అమెరికా మద్దతిస్తుందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. చర్చల ప్రక్రియపై భారత్, పాకిస్తాన్లే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రైస్ స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను చర్చల ద్వారా ఇరుదేశాలు పరిష్కరించుకునేలా సంప్రదింపులకు అమెరికా మద్దతిస్తుందని అన్నారు. ఏరూపంలోనైనా భారత్-పాకిస్తాన్ మధ్య చర్చల ప్రక్రియకు తాము బాసటగా నిలుస్తామని తేల్చిచెప్పారు.
చర్చలపై భారత్, పాకిస్తాన్లే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య చర్చల కోసం తాము మధ్యవర్తిత్వం వహించబోమని ప్రైస్ పేర్కొన్నారు. చర్చల ప్రక్రియకు ఇరు దేశాలు సమ్మతించి ముందుకొస్తే ఇరు దేశాల భాగస్వామిగా తమ వంతు పాత్ర పోషించేందుకు బాధ్యతతో వ్యవహరిస్తామని తెలిపారు. చర్చల ప్రక్రియకు విధివిధానాల్లో అమెరికా పాత్ర ఉండబోదని అన్నారు.
భారత్ వ్యతిరేక ఉగ్ర మూకలకు పాకిస్తాన్ ఎప్పటినుంచో సహకరిస్తోందని పాక్ కవ్వింపు చర్యలకు సైనిక బలగాలతో భారత్ చెక్ పెడుతుందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెలుగుచూసిన నేపధ్యంలో ప్రైస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కశ్మీర్ వ్యవహారంతో పాటు పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో అమెరికా ప్రతనిధి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read More :
Vedant Patel: అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధిగా వేదాంత పటేల్
Xi Jinping: చైనా అధ్యక్షుడిగా మూడవ సారి ఎన్నికైన జీ జిన్పింగ్